ఈ మధ్యనే రిటైర్ అయిన సచిన్ ని పాకిస్తాన్ మీడియా మరీ ఎక్కువగా పొగిడెస్తోందిట.... ఈ పొగిడే హడావిడిలో పడి సచిన్ శత్రుదేశమైన భారతీయుడనే ప్రాధమిక విషయాన్ని మీడియా మర్చిపోతోందిట...
కనుక ఇకనైనా సచిన్ను పొగడడం అపేసి ఈమధ్య అంతగా ఫాంలోలేక ఇబ్బందిపడుతూ పరుగులు సాధించలేకపోతున్న కెప్టెన్ మిస్బా ఉల్ హక్ ని పొగడమని అల్టిమేటం జారిచేసింది తాలిబన్ ఉగ్రవాద సంస్థ అయిన తెహ్రెక్-ఇ-తాలిబన్.
మిస్బా ఉల్ హక్ సరిగ్గా ఆడలేకపోవచ్చు కాని అతను పాకిస్తానీకనుక అతనిని పొగడచ్చు, సచిన్ గొప్ప ఆటగాడు కావచ్చు కానీ అతను భారతదేశానికి చెందినవాడు అది మర్చిపోవద్దు అని నొక్కి చెప్తునాడు ఆ సంస్థకి చెందిన అధికార ప్రతినిధి షాహిదుల్లా షాహిద్.
ఆధారం http://telugu.webdunia.com/sports/cricket/news/1311/28/1131128054_1.htm
0 కామెంట్లు:
కామెంట్ను పోస్ట్ చేయండి